-
OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్….
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో సినిమా (JioCinema) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
గతంలో మోహన్లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్. ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది.